ఘోర అగ్నిప్రమాదం: హోటల్లో మంటలు చిక్కుకుని 9 మంది మృతి!
- August 19, 2026
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని న్యూమార్కెట్ సమీపంలో ఉన్న మిర్జా గాలిబ్ వీధిలోని ఓ హోటల్లో (షిఖా ఇన్) బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ విషాద ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటన వివరాలు & రెస్క్యూ ఆపరేషన్
బుధవారం తెల్లవారుజామున సుమారు 2:00 గంటల సమయంలో హోటల్లోని ఒక గదిలో మంటలు చెలరేగి వేగంగా ఇతర గదులకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే 5 అగ్నిమాపక యంత్రాలు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. హోటల్ నుంచి దాదాపు 60 మందిని సురక్షితంగా బయటకు తరలించారు. మరణించిన తొమ్మిది మందిలో ఆరుగురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారు ఉన్నారు. వీరంతా వైద్య చికిత్స నిమిత్తం బంగ్లాదేశ్ నుంచి కోల్కతా వచ్చి ఈ హోటల్లో బస చేసినట్లు అధికారులు ప్రాథమికంగా ధృవీకరించారు. దట్టమైన పొగ కారణంగా అస్వస్థతకు గురైన మరో ఆరుగురిని చికిత్స కోసం కోల్కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (SSKM) కు తరలించారు.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఘట్టంలో దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక చాలా మంది స్పృహ తప్పిపడిపోయినట్లు పోలీసులు తెలిపారు. షాట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా? లేక భద్రతా నిబంధనల ఉల్లంఘన ఉందా? అనే కోణంలో న్యూమార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తమిళనాడు ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ బంపర్ ఆఫర్
- కార్మిక రెసిడెన్సీల రద్దు, ఇరాన్కు ఆర్థిక సౌకర్యాలపై UAE స్పష్టత
- ఘోర అగ్నిప్రమాదం: హోటల్లో మంటలు చిక్కుకుని 9 మంది మృతి!
- బంగారు గని కూలి 30 మంది దుర్మరణం!
- భోగాపురం ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఛార్జీల షాక్
- రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ: ముగ్గురు విద్యార్థుల హస్తం?
- కువైట్లో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు..!!
- హమాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రద్దీ.. ప్రయాణికులకు కీలక సూచనలు..!!
- దుబాయ్లో రోడ్డు భద్రతపై షార్ట్ ఫిల్మ్ తీస్తే రూ.6 లక్షలకుపైగా బహుమతి..!!
- బ్రెయిన్ డెడ్ దాతల అవయవాలతో 14 మంది ప్రాణాలకు ఊపిరి..!!







