బ్రెయిన్ డెడ్ దాతల అవయవాలతో 14 మంది ప్రాణాలకు ఊపిరి..!!

- August 19, 2026 , by Maagulf
బ్రెయిన్ డెడ్ దాతల అవయవాలతో 14 మంది ప్రాణాలకు ఊపిరి..!!

రియాద్: సౌదీ అరేబియాలో బ్రెయిన్ డెడ్ అయిన నలుగురు దాతల అవయవాలతో 14 మంది రోగులకు కొత్త జీవితం లభించింది. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. సౌదీ సెంటర్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆధ్వర్యంలో గత వారం నాలుగు అవయవ సేకరణ ప్రక్రియలను విజయవంతంగా సమన్వయం చేశారు. సౌదీ అరేబియాలోని, అలాగే దేశం వెలుపల ఉన్న పలు వైద్య సంస్థల సహకారం, సమన్వయంతో ఈ మానవతా కార్యక్రమాన్ని నిర్వహించారు.

దాతల నుంచి సేకరించిన అవయవాలను వైద్య నైతిక ప్రమాణాలకు అనుగుణంగా కేటాయించినట్లు సౌదీ సెంటర్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ తలాల్ అల్-గౌఫీ తెలిపారు. రోగుల వైద్య పరిస్థితి, అత్యవసర అవసరాలకు ప్రాధాన్యత ఇస్తూ అవయవాలను న్యాయబద్ధంగా పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ విజయానికి వివిధ సంస్థలు, వైద్య బృందాల మధ్య సమన్వయమే కారణమని అల్-గౌఫీ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో కీలకంగా పనిచేసిన ఎయిర్ మెడికల్ ఎవాక్యుయేషన్ విభాగం, వైద్య బృందాల సేవలను ఆయన ప్రశంసించారు.

సౌదీ సెంటర్ ఫర్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ దేశంలో అవయవ మార్పిడి సేవలను అభివృద్ధి చేయడానికి పనిచేస్తున్న జాతీయ సంస్థ. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ఆదేశాల మేరకు ఈ సంస్థ ఏర్పాటైంది. రోగులకు సమగ్ర వైద్య సంరక్షణ అందించడంతో పాటు జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమాలను అభివృద్ధి చేయడం, విదేశాల్లో చికిత్స పొందాల్సిన అవసరాన్ని తగ్గించడం దీని ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com