ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్గా మారిన సీఎం చంద్రబాబు
- August 19, 2026
అమరావతి: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రాంగణంలో సరికొత్తగా కనిపించారు. అసెంబ్లీ ఆవరణలో తనను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మీడియా ఫొటోగ్రాఫర్లతో ఆయన సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ల కెమెరాను స్వయంగా తన చేతిలోకి తీసుకుని, అక్కడే ఉన్న వారి చిత్రాలను తానే స్వయంగా క్లిక్ మనిపించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు
తాను స్వయంగా తీసిన ఆ ఫొటోలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు. చరిత్రను సజీవంగా నిలిపేసే అద్భుతమైన కళ ఫొటోగ్రఫీ అని ఆయన అభివర్ణించారు. కాల గర్భంలో కలిసిపోయే జ్ఞాపకాలను పదికాలాల పాటు భద్రపరిచే ఫొటోగ్రాఫర్ల సేవలు ఎనలేనివని ఆయన కొనియాడారు.
ఫొటోగ్రాఫర్ల అంకితభావానికి ప్రశంసలు
మీడియా మరియు ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్లను కలవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.వారి అవిశ్రాంత కృషి, కళానైపుణ్యం మనందరికీ సమాజాన్ని కొత్త కోణంలో చూసే దృక్పథాన్ని అందిస్తాయని తెలిపారు.రాబోయే తరాల కోసం కాలంలోని ప్రతి సుందర క్షణాన్ని బంధిస్తున్న ఫొటోగ్రఫీ కమ్యూనిటీ మరింత ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- డేటింగ్ యాప్ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!
- ఖతార్ లో అధిక విద్యుత్ వినియోగ పరికరాల ఏర్పాటుపై అలెర్ట్..!!
- అక్టోబర్ 1న అల్ షహీద్ పార్క్ ఫేజ్-3 ప్రారంభం..!!
- సౌదీ బార్డర్ చట్ట ఉల్లంఘన.. సౌదీ సిటిజన్ అరెస్ట్..!!
- ఎమిరాటీ మహిళా దినోత్సవం 2026.. యూఏఈలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు..!!
- ల్యాబ్ నుంచి మార్కెట్కు సస్టైనబిలిటీ టెక్నాలజీలు..ముందుకు సాగుతున్న షార్జా
- ధోఫార్లో విషాదం.. పారాగ్లైడింగ్ ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి..!!
- పవర్ లిఫ్టింగ్లో మెరిసిన తెలంగాణ కుర్రాడు..మోదెం వంశీకి 4 పతకాలు!
- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్గా మారిన సీఎం చంద్రబాబు
- మూవీ టికెట్ రేట్ల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!







