డేటింగ్ యాప్‌ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!

- August 19, 2026 , by Maagulf
డేటింగ్ యాప్‌ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!

మనామా: డేటింగ్ యాప్‌ ద్వారా 35 ఏళ్ల ఆసియా వ్యక్తిని వలలోకి దింపి, అతడిపై దాడి చేసి ఎలక్ట్రిక్ బైక్‌ను దోచుకున్నారనే ఆరోపణలతో 16 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న నలుగురు యువకులపై కేసు నమోదైంది.

పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రకారం.. జూన్ 17న బాధితుడు తన ఎలక్ట్రిక్ బైక్‌పై రోడ్డుపై వెళ్తుండగా నిందితులు అతడిని అడ్డుకున్నారు. అనంతరం దాడి చేసి ఎలక్ట్రిక్ బైక్‌ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో బాధితుడికి గాయాలైనట్లు వైద్య నివేదిక ధ్రువీకరించింది.

దర్యాప్తులో ఓ నిందితుడు కీలక విషయాలను వెల్లడించాడు. డేటింగ్ యాప్‌ ద్వారా బాధితుడిని నిర్దేశిత ప్రాంతానికి రప్పించేందుకు తాము ముందుగానే పథకం వేసుకున్నామని చెప్పాడు. మూడో, నాలుగో నిందితులు కూడా బాధితుడిపై దాడి చేసినట్లు అంగీకరించారు. నలుగురూ ఘటనలో తమ ప్రమేయాన్ని అంగీకరించినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ కేసును విచారిస్తున్న హై క్రిమినల్ కోర్టు ఫస్ట్ సర్క్యూట్ తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com