డేటింగ్ యాప్ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!
- August 19, 2026
మనామా: డేటింగ్ యాప్ ద్వారా 35 ఏళ్ల ఆసియా వ్యక్తిని వలలోకి దింపి, అతడిపై దాడి చేసి ఎలక్ట్రిక్ బైక్ను దోచుకున్నారనే ఆరోపణలతో 16 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న నలుగురు యువకులపై కేసు నమోదైంది.
పబ్లిక్ ప్రాసిక్యూషన్ దర్యాప్తు ప్రకారం.. జూన్ 17న బాధితుడు తన ఎలక్ట్రిక్ బైక్పై రోడ్డుపై వెళ్తుండగా నిందితులు అతడిని అడ్డుకున్నారు. అనంతరం దాడి చేసి ఎలక్ట్రిక్ బైక్ను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో బాధితుడికి గాయాలైనట్లు వైద్య నివేదిక ధ్రువీకరించింది.
దర్యాప్తులో ఓ నిందితుడు కీలక విషయాలను వెల్లడించాడు. డేటింగ్ యాప్ ద్వారా బాధితుడిని నిర్దేశిత ప్రాంతానికి రప్పించేందుకు తాము ముందుగానే పథకం వేసుకున్నామని చెప్పాడు. మూడో, నాలుగో నిందితులు కూడా బాధితుడిపై దాడి చేసినట్లు అంగీకరించారు. నలుగురూ ఘటనలో తమ ప్రమేయాన్ని అంగీకరించినట్లు ప్రాసిక్యూషన్ తెలిపింది. ఈ కేసును విచారిస్తున్న హై క్రిమినల్ కోర్టు ఫస్ట్ సర్క్యూట్ తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- డేటింగ్ యాప్ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!
- ఖతార్ లో అధిక విద్యుత్ వినియోగ పరికరాల ఏర్పాటుపై అలెర్ట్..!!
- అక్టోబర్ 1న అల్ షహీద్ పార్క్ ఫేజ్-3 ప్రారంభం..!!
- సౌదీ బార్డర్ చట్ట ఉల్లంఘన.. సౌదీ సిటిజన్ అరెస్ట్..!!
- ఎమిరాటీ మహిళా దినోత్సవం 2026.. యూఏఈలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు..!!
- ల్యాబ్ నుంచి మార్కెట్కు సస్టైనబిలిటీ టెక్నాలజీలు..ముందుకు సాగుతున్న షార్జా
- ధోఫార్లో విషాదం.. పారాగ్లైడింగ్ ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి..!!
- పవర్ లిఫ్టింగ్లో మెరిసిన తెలంగాణ కుర్రాడు..మోదెం వంశీకి 4 పతకాలు!
- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్గా మారిన సీఎం చంద్రబాబు
- మూవీ టికెట్ రేట్ల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!







