ఖతార్ లో అధిక విద్యుత్ వినియోగ పరికరాల ఏర్పాటుపై అలెర్ట్..!!
- August 19, 2026
దోహా: ఇళ్లలో, వ్యాపార సంస్థల్లో కొత్తగా అధిక విద్యుత్ వినియోగించే పరికరాలను ఏర్పాటు చేసే ముందు వైరింగ్, విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్ని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) సూచించింది.
కొత్తగా విద్యుత్ లోడ్ పెంచే సమయంలో ప్రస్తుతం ఉన్న వైరింగ్, విద్యుత్ ఇన్స్టాలేషన్లు అదనపు భారాన్ని తట్టుకోగలవా లేదా ముందుగానే పరిశీలించాలని పేర్కొంది. ముందస్తు తనిఖీలతో విద్యుత్ లోపాలు, ఓవర్లోడ్, సరఫరా అంతరాయాలు, భద్రతా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపింది. ముఖ్యంగా ఎయిర్ కండిషనర్లు, అధిక విద్యుత్ వినియోగించే ఇతర పరికరాలు ఏర్పాటు చేసినప్పుడు విద్యుత్ వ్యవస్థపై అదనపు భారం పడే అవకాశం ఉందని కహ్రామా వెల్లడించింది. అందువల్ల పరికరాలను ఏర్పాటు చేసే ముందు సాంకేతిక నిపుణులతో విద్యుత్ వ్యవస్థను పరిశీలించుకోవాలని సూచించింది.
ఇళ్లతో పాటు వాణిజ్య సంస్థలు కూడా విద్యుత్ వ్యవస్థను విస్తరించే సమయంలో భద్రతా ప్రమాణాలను పాటించాలని కహ్రామా కోరింది. ముందస్తు జాగ్రత్తలతో విద్యుత్ సరఫరా మరింత విశ్వసనీయంగా కొనసాగడంతో పాటు ఆస్తులు, ప్రజల భద్రతను కాపాడుకోవచ్చని పేర్కొంది. లోడ్ను గణనీయంగా పెంచే వారు అర్హత కలిగిన నిపుణులను సంప్రదించి వైరింగ్, విద్యుత్ వ్యవస్థ సామర్థ్యాన్ని తనిఖీ చేయించుకోవాలని కహ్రామా స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డేటింగ్ యాప్ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!
- ఖతార్ లో అధిక విద్యుత్ వినియోగ పరికరాల ఏర్పాటుపై అలెర్ట్..!!
- అక్టోబర్ 1న అల్ షహీద్ పార్క్ ఫేజ్-3 ప్రారంభం..!!
- సౌదీ బార్డర్ చట్ట ఉల్లంఘన.. సౌదీ సిటిజన్ అరెస్ట్..!!
- ఎమిరాటీ మహిళా దినోత్సవం 2026.. యూఏఈలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు..!!
- ల్యాబ్ నుంచి మార్కెట్కు సస్టైనబిలిటీ టెక్నాలజీలు..ముందుకు సాగుతున్న షార్జా
- ధోఫార్లో విషాదం.. పారాగ్లైడింగ్ ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి..!!
- పవర్ లిఫ్టింగ్లో మెరిసిన తెలంగాణ కుర్రాడు..మోదెం వంశీకి 4 పతకాలు!
- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్గా మారిన సీఎం చంద్రబాబు
- మూవీ టికెట్ రేట్ల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!







