సైరన్లను నిర్లక్ష్యం చేయొద్దు.. బయటకు రావొద్దు..!!

- August 20, 2026 , by Maagulf
సైరన్లను నిర్లక్ష్యం చేయొద్దు.. బయటకు రావొద్దు..!!

మనామా: వరుసగా సైరన్లు మోగుతుండటంతో వాటికి ప్రజలు అలవాటు పడిపోయి హెచ్చరికలను సాధారణంగా తీసుకోవద్దని బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. సైరన్ వినిపించిన ప్రతిసారీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.  మొదటిసారి సైరన్ వినిపించినప్పుడు ప్రజలు వెంటనే స్పందించే అవకాశం ఉందని, అయితే హెచ్చరికలు పదేపదే వినిపిస్తే కొందరు వాటిని సాధారణ విషయంగా భావించే ప్రమాదం ఉందని కర్నల్ ఉసామా బహర్ అన్నారు. కొందరు తమ పనులను కొనసాగించడంతో పాటు పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు బయటకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అయితే బహ్రెయిన్‌లో ప్రజల వ్యక్తిగత భద్రతే ప్రధాన ప్రాధాన్యం అని కర్నల్ బహర్ స్పష్టం చేశారు. ప్రజలను రక్షించేందుకే హెచ్చరికలు జారీ చేస్తున్నందున, సైరన్ వినిపించిన ప్రతిసారీ వాటిని తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

సైరన్ వినిపిస్తే బయటకు రావొద్దు

సైరన్ మోగినప్పుడు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు. ఆకాశంలో అడ్డుకునే చర్యలకు సంబంధించిన శబ్దం (interception sound) వినిపించినా ఇదే విధంగా సురక్షిత ప్రదేశంలో ఉండాలని సూచించారు. ఇంట్లో ఉన్నంత మాత్రాన పూర్తిగా సురక్షితంగా ఉన్నట్లు భావించకూడదని కర్నల్ బహర్ హెచ్చరించారు. భవనాల పైకప్పులు, బహిరంగ ప్రదేశాలు, ప్రమాదానికి గురయ్యే ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు.

సైరన్ మోగిన వెంటనే ప్రజలు బయట పరిస్థితిని చూడటానికి వెళ్లకుండా, ఇంట్లోనే ఉండి సురక్షితమైన, రక్షణ కల్పించే ప్రదేశానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పదేపదే హెచ్చరికలు వినిపిస్తున్నాయనే కారణంతో వాటిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. సైరన్ వినిపిస్తే అప్రమత్తంగా ఉండటం, బయటకు వెళ్లకుండా సురక్షిత ప్రదేశంలో ఉండటమే ప్రజల భద్రతకు కీలకమని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com