తెలంగాణలో ప్రతిపాదిత కొత్త జిల్లాలు ఇవే!
- August 17, 2016
తెలంగాణలో కొత్త జిల్లాల కసరత్తుని కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసింది. జిల్లాల పునర్విభజన కోసం ఏర్పడిన క్యాబినెట్ సబ్ కమిటీ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అభిప్రాయాల మేరకు 27 జిల్లాలను ప్రతిపాదిస్తూ నివేదిక రూపొందించింది. క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆ నివేదికను బుధవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్కు అందజేశారు.
కొత్త జిల్లాల స్వరూపం, కొత్త జిల్లాల సంఖ్యపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ఆయన ఆరు గంటల పాటు సుదీర్ఘంగా ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.
జిల్లాల ఏర్పాటుపై మూడురోజులపాటు నిర్వహించిన ప్రజాప్రతినిధుల సమావేశాలలో వచ్చిన ప్రతిపాదనలు, వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ఉపసంఘం పరిగణనలోకి తీసుకుందని అలీ వివరించారు.
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో మొత్తం 27 జిల్లాలుండేలా పునర్విభజన చేసేందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం 10 జిల్లాలతో పాటు రాష్ట్రంలో 17 కొత్త జిల్లాల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. వీటితో పాటు రెవెన్యూ డివిజన్లను 44 నుంచి 58కు పెంచాలని నిర్ణయించారు.
ఇప్పుడున్న 459 మండలాలను 533కు పెంచనున్నారు.సబ్ కమిటీ నివేదిక రూపొందించిన ప్రతిపాదిత జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలపై ఈ నెల 20న జరిగే అఖిలపక్ష సమావేశంలో చర్చిస్తారు. ఆ అభిప్రాయాలను కూడా తీసుకొని అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
ఆ తరువాత 22న డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నాటినుంచి నెల రోజుల వరకు ప్రజల అభిప్రాయాలను తీసుకుంటారు. వచ్చిన అభిప్రాయాల ఆధారంగా మార్పులు చేర్పులు చేసి దసరానాటికి గెజిట్ నోటిఫికేషన విడుదల చేస్తారు. దసరా నుంచి కొత్త జిల్లాల నుంచి పరిపాలన కొనసాగనుంది.
కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు ఇవే:
1. ఆదిలాబాదు జిల్లాలో కొత్తగా నిర్మల్, మంచిర్యాల
2. కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల
3. వరంగల్ జిల్లాలో హన్మకొండ, మహబూబాబాదు, భూపాలపల్లి
4. మెదక్ జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట
5. నిజామాబాదు జిల్లాలో కామారెడ్డి
6. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం
7. నల్గొండ జిల్లాలో సూర్యాపేట, యాదాద్రి
8. మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూలు, వనపర్తి
9. మిగిలిన హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలను మొత్తం నాలుగు జిల్లాలుగా విభజించాలని కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదించింది.
తాజా వార్తలు
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!









