గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- August 24, 2026
దుబాయ్: దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్కు నూతనంగా నియమితులైన భారత కాన్సుల్ జనరల్ డా.ఎమ్మడి విష్ణువర్ధన్ రెడ్డి శనివారం దుబాయ్లోని గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించారు. ఈ సందర్భంగా గురుద్వారా చైర్మన్ డా.సురేందర్ సింగ్ కంధారి, బోర్డు సభ్యులు, గురుద్వారా నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
సందర్శన సందర్భంగా డా.విష్ణువర్ధన్ రెడ్డి దర్బార్ సాహిబ్లో ప్రార్థనలు చేసి, లంగర్ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.సంగత్ సభ్యులకు స్వయంగా లంగర్ వడ్డించారు. లంగర్ సంప్రదాయానికి మూలమైన సేవ, వినయం, సమానత్వం వంటి సిక్కు విలువలను ఆయన పాల్గొనడం ప్రతిబింబించింది.
గురునానక్ దర్బార్ సేవా కార్యక్రమాల పై వివరణ
ఈ సందర్భంగా గురునానక్ దర్బార్ గురుద్వారా ఆవిర్భావం, యూఏఈలో విశ్వాసం, సామాజిక సేవ, అంతర్మత సామరస్యానికి కేంద్రంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి డా.రెడ్డికి వివరించారు.
డా.సురేందర్ సింగ్ కంధారి నూతన బాధ్యతలు చేపట్టిన డా.విష్ణువర్ధన్ రెడ్డికి అభినందనలు తెలియజేసి, ఆయన నాయకత్వంలో దుబాయ్లోని భారత కాన్సులేట్ భారతీయ సమాజంతో మరింత బలమైన అనుసంధానాన్ని కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గురునానక్ దర్బార్ చేపడుతున్న మానవతా సేవా కార్యక్రమాలు, అవసరమైన వారికి సహాయం, అంతర్మత సంబంధాల బలోపేతం, సహనం, సహజీవనం, పరస్పర గౌరవం వంటి యూఏఈ విలువలను ప్రోత్సహించే కార్యక్రమాల గురించి కూడా డా. కంధారి వివరించారు.
‘సేవా స్ఫూర్తి అందరినీ కలుపుతుంది’
డా.కంధారి మాట్లాడుతూ, డా.విష్ణువర్ధన్ రెడ్డిని గురునానక్ దర్బార్కు స్వాగతించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆయన కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
లంగర్ సేవలో డా.రెడ్డి పాల్గొనడం ఎంతో ప్రశంసనీయమని, సేవా భావం, సమానత్వం సమాజంలోని వివిధ వర్గాలను ఒక్కటిగా కలుపుతాయని ఆయన పేర్కొన్నారు.
భారతీయ సమాజ సంక్షేమం కోసం భారత కాన్సులేట్తో కలిసి పనిచేయడంతో పాటు, భారత్–యూఏఈ మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు గురునానక్ దర్బార్ కృషి కొనసాగిస్తుందని డా. కంధారి తెలిపారు.
సరోపాతో సత్కారం
సందర్శన ముగింపు సందర్భంగా డా.విష్ణువర్ధన్ రెడ్డి గురుద్వారా కమ్యూనిటీ సభ్యులతో సమావేశమై వారితో ముచ్చటించారు.అనంతరం గురుద్వారా తరఫున ఆయనకు సరోపా అందజేసి గౌరవం, స్నేహానికి గుర్తుగా సత్కరించారు.
భారత కాన్సులేట్ జనరల్తో తమ సన్నిహిత అనుబంధాన్ని కొనసాగిస్తూ, భారతీయ సమాజ సంక్షేమానికి మరియు భారత్–యూఏఈ మధ్య స్నేహ బంధాల బలోపేతానికి తమ వంతు సహకారం అందిస్తామని గురునానక్ దర్బార్ గురుద్వారా ప్రతినిధులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







