ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!

- August 25, 2026 , by Maagulf
ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!

దోహా: 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు, బదిలీల కోసం ఎలక్ట్రానిక్‌ రిజిస్ట్రేషన్‌ను ఖతర్‌ విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ప్రారంభించింది. అన్ని జాతీయతలకు చెందిన విద్యార్థులు ఈ సేవను వినియోగించుకోవచ్చని మంత్రిత్వ శాఖ  ప్రకటించింది. ఆగస్టు 25 నుంచి అక్టోబర్‌ 1 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో ప్రవేశం లేదా పాఠశాల బదిలీ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇందుకోసం మంత్రిత్వ శాఖకు చెందిన మారిఫ్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలను సిద్ధం చేసే చర్యల్లో భాగంగా మంత్రిత్వ శాఖ ఆరు కొత్త ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించడంతో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల నియామకాలు, బదిలీలను కూడా చేపట్టింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com