దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- August 25, 2026
దుబాయ్: డబ్బులు తీసుకుని వర్క్, రెసిడెన్సీ, విజిట్ వీసాలు ఇప్పిస్తామంటూ సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్లలో ప్రచారం చేస్తున్న నకిలీ ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసులు ప్రజలను హెచ్చరించారు.
దుబాయ్ పోలీసుల జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కు చెందిన యాంటీ-ఫ్రాడ్ సెంటర్ ఈ హెచ్చరికను జారీ చేసింది. కొందరు మోసగాళ్లు లైసెన్స్ లేని కంపెనీలు, కార్యాలయాల పేర్లను ఉపయోగించడం లేదా అధికారిక సంస్థలుగా నటిస్తూ ప్రజలను నమ్మించి డబ్బులు కాజేస్తున్నారని పోలీసులు తెలిపారు.
అధికారిక మార్గాల్లోనే వీసా లావాదేవీలు
‘Be Aware of Fraud’ అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. వీసాలకు సంబంధించిన అన్ని లావాదేవీలను సంబంధిత ప్రభుత్వ అధికార సంస్థలు లేదా చట్టబద్ధంగా అనుమతించబడిన కార్యాలయాల ద్వారా మాత్రమే నిర్వహించాలని సూచించారు.
తెలియని వ్యక్తులు, మధ్యవర్తులు లేదా నమ్మకంలేని సంస్థలను ఆశ్రయించవద్దని, వీసా ఆఫర్లు లేదా ప్రక్రియలకు సంబంధించిన వివరాలను అధికారిక మార్గాల ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని సూచించారు.
వీసా ఇప్పిస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పే తప్పుడు హామీలకు ఆకర్షితులు కావద్దని పోలీసులు హెచ్చరించారు. సేవను అందిస్తున్న సంస్థ నిజమైనదేనా, దానికి చట్టబద్ధమైన అనుమతులు ఉన్నాయా అనే విషయాలను ముందుగా నిర్ధారించుకోవాలని తెలిపారు.
మోసం జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలి
మోసాలపై అవగాహనతో పాటు సేవ అందించే సంస్థ మూలాన్ని ధృవీకరించుకోవడమే మోసాల నుంచి రక్షణకు తొలి అడుగు అని యాంటీ-ఫ్రాడ్ సెంటర్ పేర్కొంది.
ఎవరైనా మోసానికి గురైనా లేదా మోసపూరిత ప్రయత్నాన్ని గుర్తించినా వెంటనే దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్, సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న eCrime ప్లాట్ఫామ్ ద్వారా ఫిర్యాదు చేయాలని లేదా 901కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







