ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..

- August 25, 2026 , by Maagulf
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..

హైదరాబాద్: ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించి భారత్‌కు గర్వకారణంగా నిలిచిన బ్యాడ్మింటన్ ఛాంపియన్లు గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ(Gayatri Gopichand- Treesa Jolly) ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపిచంద్ ఆధ్వర్యంలో క్రీడాకారులు వెళ్లగా, ముఖ్యమంత్రి వారికి ఘనంగా స్వాగతం పలికారు.

అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన ఈ ఇద్దరు యంగ్ షట్లర్లను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో జరిగే ప్రతిష్టాత్మక పోటీలలో మరింతగా రాణించి మరిన్ని బంగారు పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.వి లక్ష్మి పాల్గొని క్రీడాకారులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com