ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- August 25, 2026
హైదరాబాద్: ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించి భారత్కు గర్వకారణంగా నిలిచిన బ్యాడ్మింటన్ ఛాంపియన్లు గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీ(Gayatri Gopichand- Treesa Jolly) ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశానికి జాతీయ ప్రధాన కోచ్ పుల్లెల గోపిచంద్ ఆధ్వర్యంలో క్రీడాకారులు వెళ్లగా, ముఖ్యమంత్రి వారికి ఘనంగా స్వాగతం పలికారు.
అంతర్జాతీయ స్థాయిలో దేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన ఈ ఇద్దరు యంగ్ షట్లర్లను సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సన్మానించి ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో జరిగే ప్రతిష్టాత్మక పోటీలలో మరింతగా రాణించి మరిన్ని బంగారు పతకాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.వి లక్ష్మి పాల్గొని క్రీడాకారులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







