సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- August 31, 2026
మక్కా: సౌదీ అరేబియాలోని మక్కా ప్రాంతం ఖున్ఫుదా గవర్నరేట్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్న నలుగురు విదేశీయులను బోర్డర్ గార్డ్ అధికారులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా చేపలు పట్టడంతో పాటు నిషేధిత పరికరాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అరెస్టైన వారిలో మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన పౌరులు ఉన్నారు.
సౌదీ అరేబియా ప్రాదేశిక జలాల్లో సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన భద్రతా నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత అధికారుల సమన్వయంతో నిందితులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. సముద్ర జీవవనరుల పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు, సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని బోర్డర్ గార్డ్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
పర్యావరణం లేదా వన్యప్రాణులకు సంబంధించిన ఉల్లంఘనలు కనిపిస్తే మక్కా, మదీనా, రియాద్, తూర్పు ప్రావిన్స్లలో 911, సౌదీలోని ఇతర ప్రాంతాల్లో 994కు సమాచారం ఇవ్వాలని సూచించింది. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని, సమాచారం అందించిన వ్యక్తిపై ఎలాంటి బాధ్యత ఉండదని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







