ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- August 31, 2026
అబుదాబి: ఇరాన్ వైపు నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల దిశగా వచ్చిన మానవరహిత వైమానిక వాహనం (UAV)ను గుర్తించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిపై యూఏఈ వైమానిక దళం స్పందించి తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
దేశ భద్రతకు ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు యూఏఈ సాయుధ దళాలు అత్యంత అప్రమత్త స్థితిలో ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అదేవిధంగా, దేశ గగనతలాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, భద్రతను కాపాడేందుకు వాయు రక్షణ వ్యవస్థలు 24 గంటలూ పనిచేస్తున్నాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
దేశ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగించే ఏ పరిణామాన్నైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు యూఏఈ రక్షణ వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్బేస్పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







