ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- September 04, 2026
దోహా: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులపై ఎలాంటి రూపంలోనూ శిక్షలు విధించరాదని ఖతార్ విద్యా, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) స్పష్టం చేసింది. విద్యార్థులతో వ్యవహరించే సమయంలో ఉద్యోగులు నైతిక నియమావళిని తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. స్కూల్ అండ్ స్టూడెంట్ అఫైర్స్ విభాగం ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జారీ చేసిన సర్క్యులర్లో ఈ విషయాన్ని పేర్కొంది. విద్యార్థుల గౌరవం, మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతూ వృత్తిపరమైన, విద్యాపరమైన విలువలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించింది.
విద్యార్థులకు శారీరక, మాటల ద్వారా లేదా మానసికంగా శిక్షించడం పూర్తిగా నిషేధం అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపే ఇతర రకాల వేధింపులు, దుర్వినియోగ చర్యలకు కూడా అనుమతి లేదని తెలిపింది. విద్యార్థుల ప్రవర్తనకు సంబంధించిన ఉల్లంఘనలు లేదా సమస్యలను శిక్షల ద్వారా కాకుండా, ప్రభుత్వం ఆమోదించిన విధానాలు, నిబంధనలు మరియు సర్క్యులర్లకు అనుగుణంగా తగిన విద్యాపరమైన పద్ధతులతో పరిష్కరించాలని సూచించింది.
ఈ ఆదేశాలను ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కచ్చితంగా పాటించాలని స్కూల్ అండ్ స్టూడెంట్ అఫైర్స్ విభాగం కోరింది. నిబంధనలను ఉల్లంఘించి విద్యార్థులను వేధించే లేదా దుర్వినియోగానికి పాల్పడే వారిపై అమల్లో ఉన్న విధానాలు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అదే సమయంలో, విద్యార్థులకు సురక్షితమైన, సహాయకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది చేస్తున్న కృషిని మంత్రిత్వశాఖ అభినందించింది.
తాజా వార్తలు
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం







