ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- September 05, 2026
అమరావతి: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ సీఎం సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.
సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అమూల్యం
భావి భారత పౌరులను తీర్చిదిద్దుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడికి సీఎం ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. సమాజ నిర్మాణంలోనూ, విద్యారంగ అభివృద్ధిలోనూ గురువుల పాత్ర ఎంతో అమూల్యమైనదని ఆయన కొనియాడారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. అత్యంత సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన ఆయన, తన ఆదర్శవంతమైన జీవనశైలితో దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి బాధ్యతలను చేపట్టారని పేర్కొన్నారు. సర్వేపల్లి ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గాన్ని, పాటించిన విలువలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!







