దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- September 05, 2026
దోహా: ఖతార్ కు భారత రాయబారిగా నియమితులైన డాక్టర్ శ్రీకర్ రెడ్డి దోహాకు చేరుకున్నారు. భారత కొత్త రాయబారిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆయన శనివారం దోహా చేరినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
దోహా విమానాశ్రయంలో భారత రాయబారి కార్యాలయం ఛార్జ్ డి అఫైర్స్ సందీప్ కుమార్, కతార్ విదేశాంగ శాఖ ప్రోటోకాల్ డైరెక్టర్ అంబాసిడర్ ఇబ్రహీం యూసుఫ్ ఫఖ్రోతో కలిసి డాక్టర్ శ్రీకర్ రెడ్డికి స్వాగతం పలికారు.
కొత్త రాయబారికి ఘన స్వాగతం పలికిన అంబాసిడర్ ఇబ్రహీం ఫఖ్రోకు భారత రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.
భారత్–ఖతార్ మధ్య ఇప్పటికే కొనసాగుతున్న సన్నిహిత, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు డాక్టర్ శ్రీకర్ రెడ్డి పదవీకాలంలో కృషి చేయనున్నట్లు రాయబార కార్యాలయం పేర్కొంది.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించడంతో పాటు పరస్పర సహకారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు భారత రాయబార కార్యాలయం ముందుకు సాగుతుందని తెలిపింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







