కువైట్లో భారతీయ నర్సు మృతి..!!
- September 09, 2026
కువైట్: కువైట్లో 54 ఏళ్ల భారతీయ నర్సు మృతి చెందారు. కేరళలోని చెంగన్నూర్కు చెందిన షైనీ థామస్ సోమవారం రాత్రి అబ్బాసియాలోని తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు కాపాడలేకపోయారు.
షైనీ థామస్ కువైట్లోని జహ్రా ఆసుపత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. ఆమెకు భర్త మనోజ్ ఉన్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా, వారు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
షైనీ మృతదేహాన్ని కువైట్ నుంచి భారత్కు తరలించేందుకు అవసరమైన ప్రక్రియలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఆమె ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తాజా వార్తలు
- ఖతార్ అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం..!!
- సౌదీ సార్వభౌమత్వ రక్షణకు రాజీ పడబోము..!!
- యూఎన్- బహ్రెయిన్ భాగస్వామ్యం.. కీలక రంగాల్లో పురోగతి..!!
- సబ్సిడీ డీజిల్ చోరీ కేసుల్లో 21 ట్యాంకర్లు, ట్రక్కులు సీజ్..!!
- కువైట్లో భారతీయ నర్సు మృతి..!!
- యూఏఈ స్కూళ్లలో స్కాలర్షిప్లు.. 50 శాతం వరకు ఫీజు రాయితీ..!!
- ది హేగ్ ఎంబసీ ఫెస్టివల్లో ఒమన్ సాంస్కృతిక వైభవం..!!
- అక్టోబర్ 7 దాడుల కథనంపై స్పందించిన ఎమిరేట్స్..!!
- సౌదీలో 5 రోజులపాటు వర్షాలు.. ప్రజలకు హెచ్చరిక..!!
- యూకేలో టెక్నికల్ ప్రాబ్లమ్.. ఖతార్ ఎయిర్వేస్ విమానాలకు అంతరాయం..!!







