400 మిలియన్ డాలర్లు చెల్లించనున్న అమెరికా ..
- August 20, 2016
ఇరాన్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న నలుగురు అమెరికన్ ఖైదీల విడుదలకు రంగం సిద్ధం చేసినట్టు అమెరికా కార్యదర్శి జాన్ కిర్బీ వెల్లడిం చారు. అయితే, ఆ ఖైదీల విడుదల కోసం తాము 400 మిలియన్ డాలర్ల ( రూ. 2,685 కోట్లు) మొత్తాన్ని ఇరాన్కు చెల్లించాల్సి ఉంటోందని చెప్పారు. అమెరికా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఇరాన్ ఖైదీలను విడుదల చేసినట్టయితే, తమ జైళ్లలో ఉన్న నలుగురు ఖైదీలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పేర్కొంది. ఈ మేరకు జనవరి17న ఇరుదేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అంతేగాకుండా, గతేడాది జూలైలో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య అణు ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.ఈ మేరకు ఖైదీల విడుదల విషయంలో ఇరుదేశాలు ఓ అవగాహనకు వచ్చినట్టు సమాచారం. కాగా, జైళ్లలో ఉన్న నలుగురు అమెరికన్ ఖైదీలు టెహ్రాన్ నుంచి అమెరికాకు చేరినప్పుడే పూర్తి చెల్లింపు చేస్తామని అమెరికా షరతు పెట్టడం గమనార్హం.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







