ఎయిర్ ఇండియా ప్రయాణికులకు గుడ్ న్యూస్

- September 15, 2026 , by Maagulf
ఎయిర్ ఇండియా ప్రయాణికులకు గుడ్ న్యూస్

న్యూ ఢిల్లీ: ఎయిర్ ఇండియా ప్రయాణికులకు సంస్థ కీలక శుభవార్త చెప్పింది. టికెట్ రద్దు లేదా ఇతర కారణాలతో రిఫండ్ పొందేందుకు గతంలో ఎక్కువ సమయం పట్టేది. అయితే ఇప్పుడు ఆ ప్రక్రియను గణనీయంగా వేగవంతం చేసినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. గతంలో రిఫండ్ మొత్తం ప్రయాణికుల ఖాతాల్లో జమ కావడానికి 14 రోజుల వరకు సమయం పట్టేది. ప్రస్తుతం ఈ వ్యవధిని కేవలం 4 గంటలకు తగ్గించినట్లు సంస్థ తెలిపింది.

ఏఐ ఏజెంట్లతో వేగంగా రిఫండ్
రిఫండ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు AI ఏజెంట్లను వినియోగిస్తున్నట్లు ఎయిర్ ఇండియా పేర్కొంది. సాంకేతికత ఆధారిత విధానాలతో ప్రయాణికులకు రిఫండ్ సేవలను మరింత సులభంగా, వేగంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

కస్టమర్ సర్వీసుల్లోనూ మార్పులు
రిఫండ్ సేవలకే పరిమితం కాకుండా కస్టమర్ సర్వీసులను కూడా మరింత మెరుగుపరచాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ప్రయాణికుల సమస్యలకు వేగంగా స్పందించడం, సేవలను సులభతరం చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. రిఫండ్ సమయం 14 రోజుల నుంచి 4 గంటలకు తగ్గడం వల్ల టికెట్లు రద్దు చేసుకునే ప్రయాణికులకు మరింత త్వరగా డబ్బు అందుబాటులోకి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com