మరో 18 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించిన కవిత!

- September 15, 2026 , by Maagulf
మరో 18 నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను ప్రకటించిన కవిత!

హైదరాబాద్: తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత సంస్థాగత నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వినాయక చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్మాణంలో భాగంగా మరో 18 కీలక అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను నియమించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు పార్టీ ఇంఛార్జ్‌ల నియామక ప్రక్రియ పూర్తయినట్లయింది.

హైదరాబాద్ నుంచి పల్లెల వరకు కమిటీల కసరత్తు

గ్రేటర్ హైదరాబాద్‌పై ఫోకస్: రానున్న జీహెచ్‌ఎంసీ (GHMC) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నగర పరిధిలోని పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, నాంపల్లి, అంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం స్థానాలకు నూతన ఇంఛార్జ్‌లను ఖరారు చేశారు.
ఉత్తర & దక్షిణ తెలంగాణ ప్రాతినిధ్యం: ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఖానాపూర్, నిర్మల్‌లతో పాటు.. దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, హుజూరాబాద్, దేవరకొండ, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు.
మెదక్ లోక్‌సభ స్థానానికి ఇంఛార్జ్: పార్లమెంట్ పరిధిలో పార్టీని బలోపేతం చేసేందుకు మెదక్ లోక్‌సభ ఇంఛార్జ్‌గా మద్ది శ్రీనివాస్ రెడ్డి పేరును ఖరారు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com