సౌదీ అరేబియాలోని మూడు నగరాలపై హౌతీ దాడులు..!!

- September 15, 2026 , by Maagulf
సౌదీ అరేబియాలోని మూడు నగరాలపై హౌతీ దాడులు..!!

రియాద్: సౌదీ అరేబియాలోని మూడు నగరాలపై హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు యెమెన్‌లో చట్టబద్ధ ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తున్న సంకీర్ణ కూటమి వెల్లడించింది. ఈ దాడుల్లో 13 మంది పౌరులు గాయపడగా, 7 ఇళ్లు, 2 వాహనాలు దెబ్బతిన్నాయి. సోమవారం ఖమీస్ ముషైత్, అబ్హా, తాయిఫ్ నగరాల్లోని పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని హౌతీలు బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించినట్లు కూటమి అధికార ప్రతినిధి మేజర్ జనరల్ టుర్కీ అల్ మాలికీ తెలిపారు.

ఈ దాడుల్లో గాయపడిన 13 మంది పౌరులకు స్వల్ప నుంచి మధ్యస్థ స్థాయి గాయాలైనట్లు ఆయన వెల్లడించారు. అలాగే ఏడు నివాస గృహాలు, రెండు వాహనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. పౌరులు, పౌర మౌలిక వసతులను ఉద్దేశపూర్వకంగా, పదేపదే లక్ష్యంగా చేసుకోవడం ద్వారా హౌతీల దాడులు మరింత తీవ్రతరం అవుతున్నాయని అల్ మాలికీ ఆరోపించారు.

సౌదీ అరేబియా సార్వభౌమత్వం, పౌరులు, పౌర మౌలిక వసతుల రక్షణ కోసం కూటమి బాధ్యతాయుతంగా, కఠినంగా స్పందిస్తుందని ఆయన చెప్పారు. ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 51, అంతర్జాతీయ మానవతా చట్టాలకు అనుగుణంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులను అడ్డుకునేందుకు, హౌతీల శత్రుత్వ చర్యలను ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని కార్యాచరణ చర్యలను తీసుకుంటామని అల్ మాలికీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com