యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ

- September 18, 2026 , by Maagulf
యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ

అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి రూలర్ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ప్రాంతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.

యూఏఈ–భారత్ మధ్య కొనసాగుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (Comprehensive Strategic Partnership), సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) పరిధిలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించేందుకు ఉన్న అవకాశాలపై నేతలు చర్చించారు.

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి మంచి ఆరోగ్యం, మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షించారు. భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఆయనకు విజయం చేకూరాలని కోరారు.

షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అందించిన శుభాకాంక్షలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇరుదేశాలు, వాటి ప్రజల ప్రయోజనాల కోసం యూఏఈ–భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలనే తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను కూడా ఇరువురు నేతలు చర్చించారు. ముఖ్యంగా ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు.యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ

అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ప్రాంతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.

యూఏఈ–భారత్ మధ్య కొనసాగుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (Comprehensive Strategic Partnership), సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) పరిధిలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించేందుకు ఉన్న అవకాశాలపై నేతలు చర్చించారు.

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి మంచి ఆరోగ్యం, మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షించారు. భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఆయనకు విజయం చేకూరాలని కోరారు.

షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అందించిన శుభాకాంక్షలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇరుదేశాలు, వాటి ప్రజల ప్రయోజనాల కోసం యూఏఈ–భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలనే తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను కూడా ఇరువురు నేతలు చర్చించారు. ముఖ్యంగా ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు.యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్‌తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ

అబుదాబి: యూఏఈ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, ప్రాంతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.

యూఏఈ–భారత్ మధ్య కొనసాగుతున్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం (Comprehensive Strategic Partnership), సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) పరిధిలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించేందుకు ఉన్న అవకాశాలపై నేతలు చర్చించారు.

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి మంచి ఆరోగ్యం, మరిన్ని విజయాలు కలగాలని ఆకాంక్షించారు. భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ఆయనకు విజయం చేకూరాలని కోరారు.

షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అందించిన శుభాకాంక్షలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇరుదేశాలు, వాటి ప్రజల ప్రయోజనాల కోసం యూఏఈ–భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలనే తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.

ఈ సందర్భంగా పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలను కూడా ఇరువురు నేతలు చర్చించారు. ముఖ్యంగా ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని బలోపేతం చేసేందుకు చేపడుతున్న చర్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com