జివి మొబైల్స్‌ రూ.200 కోట్లతో మహారాష్ట్రలో..

- August 21, 2016 , by Maagulf
జివి మొబైల్స్‌ రూ.200 కోట్లతో మహారాష్ట్రలో..

స్వదేశీ మొబైల్‌ తయారీ సంస్థ జివి మొబైల్స్‌ రూ.200 కోట్లతో మహారాష్ట్రలోని లోనవాలలో కొత్తగా తయారీ యూనిట్‌ స్థాపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నెలకు దాదాపు ఐదు లక్షల యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నెలకొల్పనుంది. ప్రస్తుతం సంస్థ నెలకు 3-3.5 లక్షల ఫీచర్‌ మొబైళ్లను విక్రయిస్తోంది. దీపావళి లోగా అమ్మకాలు నెలకు 6 లక్షలకు చేరుకుంటాయని సంస్థ భావిస్తోంది. డిమాండ్‌ ప్రకారం 2017-18 లోగా నెలకు 10 లక్షల వరకు అమ్మకాలు ఉంటాయని అంచనా వేస్తోంది. అందుకే లొనవాలలో రూ.180-200 కోట్లతో తయారీ యూనిట్‌ నెలకొల్పనున్నట్లు సంస్థ సీఈవో పంకజ్‌ ఆనంద్‌ తెలిపారు. వినియోగదారులు స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఒక ఫీచర్‌ ఫోనును తమ వద్ద ఉంచుకుంటున్నారని దీన్ని బట్టి భవిష్యత్తులో గిరాకీ తగ్గే అవకాశం లేదని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com