సరికొత్త సాంకేతిక హంగులతో స్కూల్ బస్సులు
- August 22, 2016
ఆర్టిఎకి చెందిన దుబాయ్ ట్యాక్సీ కార్పొరేషన్ (డిటిసి) 2016-17 సంవత్సరానికిగాను విద్యార్థుల కోసం సరికొత్త సాంకేతిక హంగులతో కూడిన స్కూల్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బస్సుల్లో విద్యార్థుల భద్రత కోసం అనేక ఏర్పాట్లు చేశారు. సిసి కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని డిటిసి కమాండ్ కంట్రోల్ సెంటర్తో లింక్ అప్ చేశారు. దాంతో బస్సులో ఏం జరుగుతోందో కంట్రోల్ సెంటర్ నుంచి మానిటర్ చేయడానికి వీలుంటుంది. అలాగే బస్సుల్ని జిపిఎస్తో అనుసంధానం చేశారు. తద్వారా డిటిసి కంట్రోల్ సెంటర్కే కాకుండా, విద్యార్థుల తల్లిదండ్రులకి, అలాగే స్కూల్ యాజమాన్యాలకీ బస్సుల వివరాలు తెలుస్తాయి. బస్సు సర్వీసులు అవసరమైన స్కూల్స్, ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. స్కూలు బస్సుల ప్రమాదాల్ని నివారించేందుకే ఈ కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని బస్సుల్లో వినియోగించనున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









