సరికొత్త సాంకేతిక హంగులతో స్కూల్‌ బస్సులు

- August 22, 2016 , by Maagulf
సరికొత్త సాంకేతిక హంగులతో స్కూల్‌ బస్సులు

ఆర్‌టిఎకి చెందిన దుబాయ్‌ ట్యాక్సీ కార్పొరేషన్‌ (డిటిసి) 2016-17 సంవత్సరానికిగాను విద్యార్థుల కోసం సరికొత్త సాంకేతిక హంగులతో కూడిన స్కూల్‌ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ బస్సుల్లో విద్యార్థుల భద్రత కోసం అనేక ఏర్పాట్లు చేశారు. సిసి కెమెరాలను ఏర్పాటు చేయడమే కాకుండా వాటిని డిటిసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో లింక్‌ అప్‌ చేశారు. దాంతో బస్సులో ఏం జరుగుతోందో కంట్రోల్‌ సెంటర్‌ నుంచి మానిటర్‌ చేయడానికి వీలుంటుంది. అలాగే బస్సుల్ని జిపిఎస్‌తో అనుసంధానం చేశారు. తద్వారా డిటిసి కంట్రోల్‌ సెంటర్‌కే కాకుండా, విద్యార్థుల తల్లిదండ్రులకి, అలాగే స్కూల్‌ యాజమాన్యాలకీ బస్సుల వివరాలు తెలుస్తాయి. బస్సు సర్వీసులు అవసరమైన స్కూల్స్‌, ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. స్కూలు బస్సుల ప్రమాదాల్ని నివారించేందుకే ఈ కొత్త తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని బస్సుల్లో వినియోగించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com