బలోచిస్థాన్‌ నేతలపై కేసులు నమోదు..

- August 22, 2016 , by Maagulf
బలోచిస్థాన్‌ నేతలపై కేసులు నమోదు..

 భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు మద్దతు తెలిపినందుకు పాకిస్థాన్‌లోని బలోచిస్థాన్‌ నేతలపై అక్కడి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. బలోచిస్థాన్‌ స్వేచ్ఛా ఉద్యమానికి మోదీ ఇటీవల మద్దతు పలుకుతూ వ్యాఖ్యలు చేశారు. మోదీ చేసిన వ్యాఖ్యలను అక్కడ ఉద్యమం చేస్తున్న నేతలు స్వాగతించారు. ఈ నేపథ్యంలో బలోచ్‌ వేర్పాటు వాద నేతలు బ్రహందగ్‌ బుగ్టి, హర్‌బియార్‌ మారి, బనుక్‌ కరిమాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పలువురు చేసిన ఫిర్యాదుల మేరకు వీరిపై వేర్పాటువాదానికి సంబంధించి ఐదు కేసులు నమోదైనట్లు చెప్పారు.భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో బలోచిస్థాన్‌ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com