థాయ్లాండ్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది
- August 23, 2016
థాయ్లాండ్: పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఉన్న థాయ్లాండ్ వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. పట్టాని ప్రావిన్స్లోని సదరన్ హోటల్ పార్కింగ్ ప్రాంతంలోనూ, హోటల్ ప్రవేశ ద్వారం వద్ద ఉంచిన ట్రక్కులోనూ మంగళవారం రాత్రి బాంబులు పేలాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. రెండు వారాల క్రితం జరిగిన బాంబు పేలుళ్లలో నలుగురు చనిపోగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. థాయ్లాండ్కు 10% శాతం వరకు ఆదాయం పర్యాటక రంగం నుంచే వస్తోంది. తరుచూ బాంబు పేలుళ్ల ఘటనలు జరుగుతుండటంతో ఆ ప్రభావం పర్యాటకంపై పడుతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









