పవిత్ర స్థలాల కోసం 7 రైళ్ళు

- August 24, 2016 , by Maagulf
పవిత్ర స్థలాల కోసం 7 రైళ్ళు

సౌదీ అరేబియా వచ్చే ఏడాది ఏడు హై స్పీడ్‌ రైళ్ళు, దేశంలోని రెండు పవిత్ర స్థలాలకు ఏర్పాటు చేయనుంది. ఈ రైళ్ళతో యాత్రీకులకు పవిత్ర స్థలాల దర్శనం ఇంకా సులువు కానుంది. మక్కా మరియు జెడ్డా మధ్య ఏడు హైస్పీడ్‌ రైళ్ళు నడుస్తాయి. మక్కా మదీనా మధ్య గంటకు రెండు రైళ్ళు నడవనున్నాయని ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ జనరల్‌ బస్సామ్‌ ఘాల్‌మాన్‌ చెప్పారు. 2009లో ఈ ప్రాజెక్ట్‌ ప్రారంభమయ్యింది. 120 ఏళ్ళ లైఫ్‌ స్పాన్‌తో ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించారు. మొత్తం 480 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్‌ పరిధి ఉంటుంది. 2016 చివరి క్వార్టన్‌ నాటికి మదినా - జెడ్డా పోర్షన్‌ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జెడ్డా నుంచి మక్కా వరకు ప్రాజెక్ట్‌ 2017 చివరి నిఆటికి అందుబాటులోకి వస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com