ఫిష్ పటూరీ
- July 29, 2015
ఫిష్ పటూరీ
కావలసిన పదార్ధాలు
చేప ముక్కలు - పావుకేజీ
ఆవాలు - ఒక స్పూను(నానబెట్టుకోవాలి)
పచ్చిమిర్చి - నాలుగు
పసుపు - చెంచా
కొబ్బరి ముక్కలు - ఒక కప్పు
చక్కెర - అర స్పూను
ఉప్పు - తగినంత
ఆవనూనె - మూడు చెంచాలు
అరటి ఆకులు - రెండు,మూడు చిన్నవి(పొట్లం కట్టడానికి వీలుగా)
తయారీ విధానం
ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి.తరువాత ఆవాలు, కొబ్బరీ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో చక్కెరా, పసుపూ, నిమ్మరసం కలిపాలి. ఈ మిశ్రమాన్ని చేపముక్కలకి పట్టించి ఉంచాలి. వాటిపై ఒక చెంచా ఆవనూనె వేసి కలిపి ఒక అరగంట సేపు అలానే ఉంచాలి. ఇప్పుడు ఒక అరటి ఆకును తీసుకుని దానిలో చేప ముక్కను ఉంచి దాని అంచుల్ని మూసి పొట్లంలా దారంతో చుట్టేయాలి. ఇలాగే మిగతా ముక్కలను కూడా చేసి ఆవిరి మీద ఈ ముక్కలను పది నిముషాల పాటు ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు ఆవిరి నుంచి తీసుకుని ఆరటి ఆకులు తొలగించి వేడి వేడి అన్నంతో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









