ఫిష్ పటూరీ
- July 29, 2015
ఫిష్ పటూరీ
కావలసిన పదార్ధాలు
చేప ముక్కలు - పావుకేజీ
ఆవాలు - ఒక స్పూను(నానబెట్టుకోవాలి)
పచ్చిమిర్చి - నాలుగు
పసుపు - చెంచా
కొబ్బరి ముక్కలు - ఒక కప్పు
చక్కెర - అర స్పూను
ఉప్పు - తగినంత
ఆవనూనె - మూడు చెంచాలు
అరటి ఆకులు - రెండు,మూడు చిన్నవి(పొట్లం కట్టడానికి వీలుగా)
తయారీ విధానం
ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి.తరువాత ఆవాలు, కొబ్బరీ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో చక్కెరా, పసుపూ, నిమ్మరసం కలిపాలి. ఈ మిశ్రమాన్ని చేపముక్కలకి పట్టించి ఉంచాలి. వాటిపై ఒక చెంచా ఆవనూనె వేసి కలిపి ఒక అరగంట సేపు అలానే ఉంచాలి. ఇప్పుడు ఒక అరటి ఆకును తీసుకుని దానిలో చేప ముక్కను ఉంచి దాని అంచుల్ని మూసి పొట్లంలా దారంతో చుట్టేయాలి. ఇలాగే మిగతా ముక్కలను కూడా చేసి ఆవిరి మీద ఈ ముక్కలను పది నిముషాల పాటు ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు ఆవిరి నుంచి తీసుకుని ఆరటి ఆకులు తొలగించి వేడి వేడి అన్నంతో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







