ఫిష్ పటూరీ
- July 29, 2015
ఫిష్ పటూరీ
కావలసిన పదార్ధాలు
చేప ముక్కలు - పావుకేజీ
ఆవాలు - ఒక స్పూను(నానబెట్టుకోవాలి)
పచ్చిమిర్చి - నాలుగు
పసుపు - చెంచా
కొబ్బరి ముక్కలు - ఒక కప్పు
చక్కెర - అర స్పూను
ఉప్పు - తగినంత
ఆవనూనె - మూడు చెంచాలు
అరటి ఆకులు - రెండు,మూడు చిన్నవి(పొట్లం కట్టడానికి వీలుగా)
తయారీ విధానం
ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి.తరువాత ఆవాలు, కొబ్బరీ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో చక్కెరా, పసుపూ, నిమ్మరసం కలిపాలి. ఈ మిశ్రమాన్ని చేపముక్కలకి పట్టించి ఉంచాలి. వాటిపై ఒక చెంచా ఆవనూనె వేసి కలిపి ఒక అరగంట సేపు అలానే ఉంచాలి. ఇప్పుడు ఒక అరటి ఆకును తీసుకుని దానిలో చేప ముక్కను ఉంచి దాని అంచుల్ని మూసి పొట్లంలా దారంతో చుట్టేయాలి. ఇలాగే మిగతా ముక్కలను కూడా చేసి ఆవిరి మీద ఈ ముక్కలను పది నిముషాల పాటు ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు ఆవిరి నుంచి తీసుకుని ఆరటి ఆకులు తొలగించి వేడి వేడి అన్నంతో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







