ఫిష్ పటూరీ
- July 29, 2015
ఫిష్ పటూరీ
కావలసిన పదార్ధాలు
చేప ముక్కలు - పావుకేజీ
ఆవాలు - ఒక స్పూను(నానబెట్టుకోవాలి)
పచ్చిమిర్చి - నాలుగు
పసుపు - చెంచా
కొబ్బరి ముక్కలు - ఒక కప్పు
చక్కెర - అర స్పూను
ఉప్పు - తగినంత
ఆవనూనె - మూడు చెంచాలు
అరటి ఆకులు - రెండు,మూడు చిన్నవి(పొట్లం కట్టడానికి వీలుగా)
తయారీ విధానం
ముందుగా చేప ముక్కల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి.తరువాత ఆవాలు, కొబ్బరీ, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో చక్కెరా, పసుపూ, నిమ్మరసం కలిపాలి. ఈ మిశ్రమాన్ని చేపముక్కలకి పట్టించి ఉంచాలి. వాటిపై ఒక చెంచా ఆవనూనె వేసి కలిపి ఒక అరగంట సేపు అలానే ఉంచాలి. ఇప్పుడు ఒక అరటి ఆకును తీసుకుని దానిలో చేప ముక్కను ఉంచి దాని అంచుల్ని మూసి పొట్లంలా దారంతో చుట్టేయాలి. ఇలాగే మిగతా ముక్కలను కూడా చేసి ఆవిరి మీద ఈ ముక్కలను పది నిముషాల పాటు ఉడికించి తీసుకోవాలి. ఇప్పుడు ఆవిరి నుంచి తీసుకుని ఆరటి ఆకులు తొలగించి వేడి వేడి అన్నంతో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









