'అబ్దుల్‌ కలాం' అంత్యక్రియలు పూర్తి

- July 29, 2015 , by Maagulf
'అబ్దుల్‌ కలాం' అంత్యక్రియలు పూర్తి

ప్రజా రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్‌ కలాం అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. రామేశ్వరం రైల్వేస్టేషన్‌ దగ్గర సైనిక లాంఛనాలతో కలాం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, కేంద్రమంత్రులు పారికర్‌, వెంకయ్యనాయుడు, సీఎంలు చంద్రబాబు, ఉమెన్‌చాంది, సిద్దరామయ్య, తమిళనాడు మంత్రి పన్నీర్‌సెల్వం, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆజాద్‌, టీడీపీ ఎంపీ సీఎంరమేష్‌, శాస్త్రవేత్తలు, కోలీవుడ్‌ ప్రముఖులు తదితరులు అంతిమ సంస్కారాలకు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు, ప్రజలు అశ్రునయనాలతో కలాంకు తుది వీడ్కోలు పలికారు. అంతకుముందు రామేశ్వరంలోని స్వగృహం నుంచి భారీ జనసందోహం మధ్య కలాం అంతిమయాత్ర నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com