టర్కీ విమానాశ్రయం లక్ష్యంగా ఉగ్రవాదులు నాలుగు రాకెట్ లాంచర్లు..
- August 27, 2016
టర్కీ విమానాశ్రయం లక్ష్యంగా ఉగ్రవాదులు నాలుగు రాకెట్ లాంచర్లు ప్రయోగించారు. అయితే, అదృష్టవశాత్తు అవి కాస్త ఓ ఖాళీ స్థలంలో పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని అక్కడి వార్తా సంస్థ డాగన్ తెలిపింది. టర్కీ నగరంలోని దియార్ బకీర్ ఎయిర్ పోర్ట్ ఉంది. దీనిని లక్ష్యంగా కుర్దీష్ ఉగ్రవాదులు నాలుగు రాకెట్ లాంచర్లు ప్రయోగించారు.
అవి ఎయిర్ పోర్ట్ లోని పోలీస్ పోస్ట్ కు సమీపంలో పడ్డాయి. వీటి పేలుడు శబ్దం నగరమంతటా వ్యాపించాయి. వాటికారణంగా ఏర్పడిన దుమ్ముదూళికి పలు నివాసాలవారు కిటికీలు మూసుకున్నారు. ఘటన ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. అయితే, అవి ఖాళీ స్థలంలో పడటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకోలేదు.
గత మూడు దశాబ్దాలుగా కుర్దీష్ తిరుగుబాటుదారులకు భద్రతా బలగాలకు మధ్య దాడులు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









