మన్కీ బాత్ కార్యక్రమంలో మోదీ ...
- August 27, 2016
మన ఆడబిడ్డలే దేశానికి గర్వకారణమని, ప్రోత్సాహిస్తే ఎవరికీ తీసిపోమని రియో ఒలింపిక్స్లో నిరూపించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆదివారం జరిగిన మన్కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఒలింపిక్స్పై దేశంలో ఆసక్తి పెరుగుతోందని, సింధు, సాక్షి మాలిక్ పతకాలు గెలవడం సంతోషంగా ఉందన్నారు. ధ్యాన్చంద్కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని, ధ్యాన్చంద్ సేవలను అందరూ మననం చేసుకోవాల్సి ఉందన్నారు. ధ్యాన్చంద్ దేశభక్తి, క్రీడాస్ఫూర్తి నిరుపమానం అన్నారు. జిమ్నాస్టిక్స్లో దీపాకర్మాకర్ తన ప్రతిభ ద్వారా అందరి మనసు దోచుకుందని, అలాగే గోపీచంద్ గొప్ప గురువు అని, గోపీచంద్కు అభినందనలు తెలుపుతున్నానన్నారు.
మోదీ యాప్ ద్వారా ఒలింపిక్స్పై ఎంతో మంది స్పందించారని, దేశ ప్రజలంతా క్రీడలపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని, క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరం అన్నారు. 2020లో జరిగే ఒలింపిక్స్లో పతకాల సాధనకు ఇప్పటి నుంచే రోడ్మ్యాప్ సిద్ధం చేయాలని, ప్రపంచ క్రీడారంగంలోని నైపుణ్యాలను అధ్యయనం చేయాలన్నారు. అలాగే 2020, 2024, 2028 ఒలింపిక్స్కు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని, పర్యావరణానికి హాని చేయని వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







