సోమాలియా దేశాధ్యక్షుడి నివాసం బయట బాంబు పేలుడు
- August 30, 2016
సోమాలియా దేశాధ్యక్షుడి నివాసానికి సమీపంలోనే కారు బాంబు పేలింది. రాజధాని మోగదీషు నగరంలో అధ్యక్షుడి ప్యాలెస్ బయట బాంబు పేలడంతో అక్కడి హోటల్స్ పాక్షికంగా దెబ్బతిన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. దుండగుడు కారులో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసు అధికారి మేజర్ మహ్మద్ అలీ వెల్లడించారు. అధ్యక్షుడు హసన్ షేక్ నివాసానికి ఎదురుగా ఉన్న రెండు హోటల్స్ దెబ్బతిన్నట్లు ఆయన తెలిపారు. బాంబు పేలిన వెంటనే పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. పేలుడు తర్వాత తుపాకీ కాల్పులు కూడా వినిపించినట్లు పోలీసులు వెల్లడించారు.అలాగే హోటల్ వద్ద అల్షబాబ్ గ్రూప్ మిలిటెంట్లు ఉన్నట్లు సమాచారం.
ఉగ్రవాద సంస్థ అల్ఖైదాకు అనుబంధ గ్రూప్ అయిన అల్-షబాబ్కు చెందిన మిలిటెంట్లు ఇటీవల మోగదీషుపై తరచూ దాడులకు తెగబడుతున్నారు. ఈ నెల ప్రారంభంలో మోగదీషులోని రెస్టారెంట్పై జరిగిన దాడిలో 9 మంది మరణించారు. మంగళవారం ఏకంగా అధ్యక్ష నివాసం వద్దే దాడి చేశారు.
పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







