ఇద్దరు పోలీసుల మృతికి కారణమైన ఒంటె
- September 01, 2016
ఓ ఒంటె కారణంగా ఇద్దరు రాయల్ ఒమన్ పోలీసులు మృతి చెందిన ఘటన ముదైబిలో చోటుచేసుకుంది. రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళుతోన్న ఒంటెను, రాయల్ ఒమన్ పోలీసులకు చెందిన పెట్రోలింగ్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఇద్దరు పోలీసులు చనిపోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ఈ ప్రమాదంలో. రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే ఒంటెలతో వాహనదారులకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఒంటెల్ని పెంచుకుంటున్నవారు, వాటిని రోడ్లపైకి విచ్చలవిడిగా వదిలేయరాదనీ, రాత్రి వేళల్లో ఒంటెల కారణంగా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని రాయల్ ఒమన్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







