భారతీయ టీవీ చానల్స్ ను నిషేధించిన పాక్ ప్రభుత్వం

- September 01, 2016 , by Maagulf
భారతీయ టీవీ చానల్స్ ను నిషేధించిన పాక్ ప్రభుత్వం

భారత్ కు చెందిన అన్ని టీవీ చానల్స్ ను పాకిస్తాన్ ప్రభుత్వం నిషేధించింది. బలూచిస్తాన్ భాషలో ఆకాశవాణి ప్రసారాలు చేయాలని తీసుకున్న నిర్ణయానికి పాక్ ఈ విధంగా కౌంటరిచ్చింది. డైరెక్ట్ హోం ద్వారా కూడా భారతీయ చానల్స్ ను ప్రసారం చేయవద్దని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశించింది. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో బలూచిస్తాన్ అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. అప్పటి నుంచి పాక్ డిఫెన్స్ లో పడింది. ఇప్పుడు బలూచిస్తాన్ భాషలో ఆకాశ వాణి కార్యక్రమాలను ప్రసారం చేయాలనే నిర్ణయం పాక్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో భారతీయ చానళ్లను నిషేధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com