రోడ్డు మార్గంలో హజ్ వచ్చేవారికి నేటితో ముగియనున్న గడువు
- September 02, 2016
రోడ్డు మార్గంలో వచ్చే హజ్ యాత్రీకులకు డెడ్లైన్ నేటితో (శుక్రవారం సెప్టెంబర్ 2) ముగియనుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ వెల్లడించింది. గడువు ముగియనున్న దరిమిలా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా గడవు లోపు యాత్రీకులు హజ్ కోసం తరలి రావాలని పిలుపునిచ్చారు. ఇంకో వైపున జిసిసి దేశాల నుంచి హజ్ యాత్రకు వచ్చేవారు, తమ వెంట ఆయా దేశాలు ఇచ్చే పర్మిట్స్ని తమ వెంట తప్పనిసరిగా తీసుకురావాలనీ, లేని పక్షంలో వారిని తిరిగి పంపించేస్తామని జనరల్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది. గ్రాండ్ మాస్క్ వద్ద మతాఫ్ సెక్షన్ నుంచి వీల్చైర్స్ వినియోగంపై బ్యాన్ విధించామనీ, ఈ సూచనను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు కోరారు. యాత్రీకుల భద్రత నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నట్లు వారు వెల్లడించారు. మక్కా టన్నెల్స్ అన్నీ పలు టీమ్లతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, టాక్సిక్ గ్యాస్ విషయమై పరీక్షలు నిరంతరం జరుగుతాయనీ, అనుకోని సంఘటనలు ఎదురైతే వెంటనే తగిన చర్యలు తీసుకోబడ్తాయని సివిల్ డిఫెన్స్ చీఫ్ బ్రిగేడియర్ అహ్మద్ అల్ దులైవి చెప్పారు. వీల్ చైర్స్ డిపార్ట్మెంట్, 300 బ్యాటరీ ఆపరేటెడ్ వీల్చైర్స్ని అందుబాటులో ఉంచామనీ, ఇరవై నాలుగ్గంటలూ అవి అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు. హజ్ సీజన్లో ఉష్ణోగ్రతలో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!









