మహిళల డబుల్స్ క్వార్టర్స్లో సానియా ఓటమి
- September 06, 2016
యూఎస్ ఓపెన్లో భారత పోరు ముగిసింది. ఇప్పటికే బోపన్న, పేస్ జోడీలు తమ తమ విభాగాల్లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తాజాగా మహిళల డబుల్స్ క్వార్టర్స్లో సానియా జోడీ కూడా పరాజయం పాలైంది. దీంతో టోర్నీ నుంచి సానియా కూడా నిష్క్రమించింది.టోర్నీ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన సానియా-స్ట్రైకోవా జోడీ.. క్వార్టర్స్లో మాత్రం తడబడింది. టాప్ సీడ్ కరోలిన్ గ్రేషియా-క్రిస్టినా జోడీ ఎదురుదాడిని తట్టుకోలేకపోయింది. మొదటి సెట్లో ఇరు జోడీల మధ్య హోరాహోరీ పోరు జరిగినా..
టై బ్రేకింగ్లో సానియా జోడీపై కరోలిన్ ద్వయం తొలి సెట్ దక్కించుకుంది. ఇక రెండో సెట్లో సానియా జోడీ పూర్తిగా వెనుకబడిపోయింది. దీంతో కరోలిన్-క్రిస్టినా చేతిలో 6-7, 1-6 సెట్లతో సానియా ద్వయం ఓటమి చవిచూసింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







