మహిళల డబుల్స్ క్వార్టర్స్లో సానియా ఓటమి
- September 06, 2016
యూఎస్ ఓపెన్లో భారత పోరు ముగిసింది. ఇప్పటికే బోపన్న, పేస్ జోడీలు తమ తమ విభాగాల్లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తాజాగా మహిళల డబుల్స్ క్వార్టర్స్లో సానియా జోడీ కూడా పరాజయం పాలైంది. దీంతో టోర్నీ నుంచి సానియా కూడా నిష్క్రమించింది.టోర్నీ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన సానియా-స్ట్రైకోవా జోడీ.. క్వార్టర్స్లో మాత్రం తడబడింది. టాప్ సీడ్ కరోలిన్ గ్రేషియా-క్రిస్టినా జోడీ ఎదురుదాడిని తట్టుకోలేకపోయింది. మొదటి సెట్లో ఇరు జోడీల మధ్య హోరాహోరీ పోరు జరిగినా..
టై బ్రేకింగ్లో సానియా జోడీపై కరోలిన్ ద్వయం తొలి సెట్ దక్కించుకుంది. ఇక రెండో సెట్లో సానియా జోడీ పూర్తిగా వెనుకబడిపోయింది. దీంతో కరోలిన్-క్రిస్టినా చేతిలో 6-7, 1-6 సెట్లతో సానియా ద్వయం ఓటమి చవిచూసింది.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









