మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సానియా ఓటమి

- September 06, 2016 , by Maagulf
మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సానియా ఓటమి

యూఎస్‌ ఓపెన్‌లో భారత పోరు ముగిసింది. ఇప్పటికే బోపన్న, పేస్‌ జోడీలు తమ తమ విభాగాల్లో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించగా.. తాజాగా మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌లో సానియా జోడీ కూడా పరాజయం పాలైంది. దీంతో టోర్నీ నుంచి సానియా కూడా నిష్క్రమించింది.టోర్నీ ఆరంభం నుంచి దూకుడు ప్రదర్శించిన సానియా-స్ట్రైకోవా జోడీ.. క్వార్టర్స్‌లో మాత్రం తడబడింది. టాప్‌ సీడ్‌ కరోలిన్‌ గ్రేషియా-క్రిస్టినా జోడీ ఎదురుదాడిని తట్టుకోలేకపోయింది. మొదటి సెట్లో ఇరు జోడీల మధ్య హోరాహోరీ పోరు జరిగినా..
టై బ్రేకింగ్‌లో సానియా జోడీపై కరోలిన్‌ ద్వయం తొలి సెట్‌ దక్కించుకుంది. ఇక రెండో సెట్లో సానియా జోడీ పూర్తిగా వెనుకబడిపోయింది. దీంతో కరోలిన్‌-క్రిస్టినా చేతిలో 6-7, 1-6 సెట్లతో సానియా ద్వయం ఓటమి చవిచూసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com