ఇసుక తుపాన్లనుండి ఆరోగ్యాన్ని కాపాడుకోండిలా
- April 14, 2015
గల్ఫ్ దేశాల్లో ఇసుక తుపాన్లు వేసవి కాలంలో ఎక్కువగా ప్రజల్ని ఇబ్బంది పెడ్తుంటాయి. అనేక అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే ఇసుక తుపాన్లనుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి హమాద్ మెడికల్ కార్పొరేషన్, ప్రజలకు కొన్ని సూచనలు, సలహాలు అందిస్తోంది. ఎలర్జీలు, శ్వాసకోశ సమస్యలూ ఇసుక తుపాన్ల వల్ల ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలు. ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఇంట్లోంచి బయటకు రాకుండా చూడాలనీ, తుపాన్లు వచ్చే అవకాశం ఉన్న సమయాల్లో పార్కులకు వెళ్ళకుండా వుండటమే మంచిదనీ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తగినంతగా ఇసుక తుపాన్లపై ప్రచారం జరుగుతుండడంతోపాటు, ప్రజల్లో పెరిగిన అవగాహనతో తుపాన్ల వల్ల అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరగడంలేదని వైద్యులు వెల్లడిరచారు. వైద్యులు అందిస్తున్న సలహాలు ఏమిటంటే, భారీగా ఈదురుగాలులు వీస్తున్నప్పుడు, విజిబులిటీ లేనప్పుడు బయటకు వెళ్ళడాన్ని వీలైనంతవరకు తగ్గించుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళాల్సి వస్తే నోటికీ, ముక్కుకీ మాస్క్ వేసుకోవాలి. కళ్ళు పూర్తిగా కవర్ అయ్యేలా స్పెక్టకల్స్ని ధరించాలి. కళ్ళలో దుమ్ము పడినట్లు అనిపిస్తే, చల్లటి నీళ్ళతో కడగాలి. కాంటాక్ట్ లెన్స్ వున్నవారు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దగ్గు, జలుబు వంటి సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. కార్లలో ప్రయాణించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ విండో గ్లాసెస్ని క్లోజ్ చేసి వుంచాలి. చిన్న పిల్లలు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడ్తున్నవారికి శ్వాసకోశ సమస్యలు తీవ్రంగా పరిణమిస్తాయి గనుక, వారిని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







