ఒమన్లో ఉచిత కన్సల్టేషన్తో కొత్త హాస్పిటల్
- September 08, 2016
మస్కట్: ఒమన్లో కొత్తగా ఏర్పాటయిన ఆసుపత్రిలో ఉచిత కన్సల్టేషన్ రోగులకు లభించనుంది. ఆసుపత్రి కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత నెల రోజులపాటు ఈ ఉచిత కన్సల్టేషన్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. షిఫా అల్ జజీరా మెడికల్ గ్రూప్, తన తొలి ప్రీమియమ్ పోలీ క్లినిక్ని అల్ కువైర్లో సెప్టెంబర్ 29న ప్రారంభం కానుంది. ఉచిత కన్సల్టేషన్, ట్రీట్మెంట్తో అక్టోబర్ 29 వరకు రోగులకు సేవలు అందిస్తుంది. హాస్పిటల్లో 24 మంది స్పెషలిస్టులు సేవలు అందించనున్నారని చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కెటి రుబీయుల్లా చెప్పారు. అలాగే తమ గ్రూపు జిసిసిలోని ప్రముఖ ఆసుపత్రులతోనూ, ఇండియాలోని పలు ఆసుపత్రులతోనూ 'టై అప్' పెట్టుకోనుందని వివరించారు. కేరళలోని కోజికోడ్లో గల బేబీ మెమోరియల్ హాస్పిటల్ (బిఎమ్హెచ్)తో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. బిఎమ్హెచ్ 800 పడకలతో 40 మెడికల్ సర్జికల్ డిపార్ట్మెంట్స్ని కలగి ఉందని బిఎంహెచ్ ఛైర్మన్ డాక్టర్ కెజి అలెగ్జాండర్ తెలిపారు. వైద్య చికిత్స కోసం ఇండియాలోని కేరళకువ ఎళ్ళే వారి కోసం మస్కట్లో స్పెషల్ డెస్క్ని ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ రుబీయుల్లా చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







