కంపెనీలపై 85 శాతం ఫిర్యాదులకు పరిష్కారం
- September 08, 2016
దోహా: కమ్యూనికేషన్స్ రెగ్యులేటరీ అథారిటీ (సిఆర్ఎ), ఓరెడూ, వోడాఫోన్ ఖతార్లకు వ్యతిరేకంగా వచ్చిన 877 ఫిర్యాదుల్లో 85 శాతం ఫిర్యాదుల్ని పరిష్కరించింది. మిగతా సమస్యలకు పరిష్కారం విషయంలో ఆయా కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు సిఆర్ఎ కన్స్యూమర్ ఎఫైర్స్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం కోసం సంబంధిత కంపెనీలకు ఫిర్యాదు చేయవచ్చనీ, ఒకవేళ 30 రోజుల తర్వాత కూడా పరిష్కారం దొరకకపోతే '103' అనే సిఆర్ఎ హాట్లైన్కి ఫిర్యాదు చేయవచ్చని సిఆర్ఎ కన్స్యూమర్స్ ఎఫైర్స్ షడిపార్ట్మెంట్ మేనేజర్ అమీల్ సలీమ్ అల్ హనావి చెప్పారు. ఇ-మెయిల్ ద్వారా కూడా వినియోగదారులు సర్వీస్ ప్రొవైడర్లపై పిర్యాదు చేయవచ్చని ఆమె తెలిపారు. నెట్ వర్క్ సమస్యలు, డివైజ్ ఇన్స్టలేషన్లో ఆలస్యం లాంటి సమస్యలు ఎక్కువగా వినియోగదారుల నుంచి సర్వీస్ ప్రొవైడర్లపై వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







