కేజీ వెండి ధర రూ. 47వేలు

- September 08, 2016 , by Maagulf
కేజీ వెండి ధర రూ. 47వేలు

గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టి.. రూ. 44వేల వరకు చేరిన వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల ప్రభావంతో నిన్న ఒక్క రోజే రూ. 750 పెరగగా.. గురువారం మరో రూ. 50 పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 47వేలకు చేరింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు వూపందుకోవడంతో ధరలు పెరిగినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి.మరోవైపు బంగారం ధర నేడు కాస్త తగ్గడంతో 30 నెలల గరిష్ఠ స్థాయి నుంచి దిగొచ్చింది.రూ. 250 తగ్గడంతో బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పదిగ్రాముల పసిడి ధర రూ. 31,300గా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com