రెండు సాక్షరభారత్ అవార్డులను కైవశం చేసుకున్న తెలంగాణా
- September 08, 2016
దేశ రాజధాని దిల్లీలోని విజ్ఞాన్ భవన్లో అక్షరాస్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన గ్రామాలకు రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ సాక్షరభారత్ అవార్డులు అందజేశారు. తెలంగాణ రాష్ట్రం రెండు సాక్షరభారత్ అవార్డులు సాధించింది. ఎంపీ వినోద్ దత్తత గ్రామం వీరన్నపల్లి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి దత్తత గ్రామం బకారం అవార్డులకు ఎంపికయ్యాయి. ఈ రెండు గ్రామాల సర్పంచులు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 15-50ఏళ్ల మధ్య వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సాక్షరభారత్ పతకాన్ని ప్రవేశపెట్టింది.ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధిలో వీరన్నపల్లి 11వ స్థానంలో నిలవడం విశేషం.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









