గడువు తీరిన ఆహార పదార్థాల సీజ్
- September 10, 2016
రియాద్: 60,000 కౌంటర్ఫీట్ మరియు గడువు తీరిన కన్జ్యూమర్ ఐటమ్స్ని మక్కా, మదీనా, తాయిఫ్లో అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసినవాటిలో ఫుడ్ ఐటమ్స్, షాంపూలు, డిటర్జెంట్లు, అలాగే ఫుడ్ స్టఫ్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, హజ్ సందర్భంగా హజ్ యాత్రీకులకు సరైన ఆహార పదార్థాలు, ఇతర కన్జ్యూమర్స్ అందేలా చేసేందుకు, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని సీజ్ చేసేందుకు క్యాంపెయిన్స్ నిర్వహిస్తోంది. మినిస్ట్రీ అధికారి ఒకరు సీజ్ చేసిన ఆహార పదార్థాల గురించి వివరిస్తూ, కొన్ని ఆహార పదార్థాల్ని సరైన పద్ధతుల్లో స్టోర్ చేయలేదని, వాటిని సీజ్ చేశామని అన్నారు. మక్కాలో 66 కౌంటర్ఫీట్ ఐటమ్స్, 996 వెరైటీస్ ఆఫ్ కౌంటర్ ఫీట్ గూడ్స్ని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. తైఫ్లో 44,000 ప్యాకెట్ల షాంపూలని గడువుతీరినవిగా గుర్తించినట్లు వారు వెల్లడించారు. మదీనాలో 15,000 ఐటమ్స్ని సీజ్ చేశారు. వీటిల్లో షాంపూలు, ఫేస్ క్రీమ్స్ ఉన్నాయి. ఈ మధ్యనే 140,000 ఫుడ్ ఐటమ్స్ని ఓ వేర్ హౌస్లో సీజ్ చేశారు అధికారులు. మినిస్ట్రీ మొబైల్ షాపులపైనా, కమర్షియల్ రిఫ్రిజిరేటర్స్ మరియు ఫుడ్ ట్రక్స్పైనా నిఘా పెట్టిందని వారు వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







