ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ స్పెషల్ ఫేర్స్
- September 10, 2016
లో కాస్ట్ క్యారియర్ ఎయిర్ ఇండియా శ్రీక్స్ప్రెస్, స్పెషల్ ఫేర్స్ని అబుదాబీ, సార్జా నుంచి ఎంపిక చేయబడిన రూట్లలో ప్రకటించింది. సెప్టెంబర్ 14 నుంచి అబుదాబీ - కోజి కోడ్ మధ్య చార్జీలు 365 దిర్హామ్లకు తగ్గుతుంది. ఎయిర్ ఇండియా ట్రావెల్ కన్సల్టెంట్ అబ్దుల్ సలైహ్ ఈ వివరాల్ని వెల్లడించారు. మామూలుగా అయితే కోజికోడ్కి ఒక వైపు చార్జీ 435 దిర్హామ్లు అంతకు మించి ఉంటుంది. ఒక్కోసారి ఈ మొత్తం 1,110 దిర్హామ్ల వరకు వెళుతుంది. సెప్టెంబర్ 14 వరకు తమ విమానాలన్నీ ఫుల్ అయిపోయినట్లుగా ఆయన వివరించారు. షార్జా ఆఫర్ల విషయానికి వస్తే, సెప్టెంబర్ 15 నుంచి నాన్ స్టాప్ విమానాలకు షార్జా నుంచి ఛండీగర్ వెళ్ళేందుకు 210 దిర్హామ్లు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ కొత్త రూట్లో ప్రమోషనల్ ఆఫర్గా దీన్ని ప్రకటించినట్లు అధికారులు వివరించారు. సెప్టెంబర్ 14 నుంచి కోచి కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ షార్జా నుంచి వారణాసి, తిరుచురాపల్లికి రోజువారీ నాన్స్టాప్ విమానాల్ని నడపనుంది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







