ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ ఫేర్స్‌

- September 10, 2016 , by Maagulf
ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ స్పెషల్‌ ఫేర్స్‌

లో కాస్ట్‌ క్యారియర్‌ ఎయిర్‌ ఇండియా శ్రీక్స్‌ప్రెస్‌, స్పెషల్‌ ఫేర్స్‌ని అబుదాబీ, సార్జా నుంచి ఎంపిక చేయబడిన రూట్లలో ప్రకటించింది. సెప్టెంబర్‌ 14 నుంచి అబుదాబీ - కోజి కోడ్‌ మధ్య చార్జీలు 365 దిర్హామ్‌లకు తగ్గుతుంది. ఎయిర్‌ ఇండియా ట్రావెల్‌ కన్సల్టెంట్‌ అబ్దుల్‌ సలైహ్‌ ఈ వివరాల్ని వెల్లడించారు. మామూలుగా అయితే కోజికోడ్‌కి ఒక వైపు చార్జీ 435 దిర్హామ్‌లు అంతకు మించి ఉంటుంది. ఒక్కోసారి ఈ మొత్తం 1,110 దిర్హామ్‌ల వరకు వెళుతుంది. సెప్టెంబర్‌ 14 వరకు తమ విమానాలన్నీ ఫుల్‌ అయిపోయినట్లుగా ఆయన వివరించారు. షార్జా ఆఫర్ల విషయానికి వస్తే, సెప్టెంబర్‌ 15 నుంచి నాన్‌ స్టాప్‌ విమానాలకు షార్జా నుంచి ఛండీగర్‌ వెళ్ళేందుకు 210 దిర్హామ్‌లు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ కొత్త రూట్‌లో ప్రమోషనల్‌ ఆఫర్‌గా దీన్ని ప్రకటించినట్లు అధికారులు వివరించారు. సెప్టెంబర్‌ 14 నుంచి కోచి కేంద్రంగా పనిచేస్తున్న తమ సంస్థ షార్జా నుంచి వారణాసి, తిరుచురాపల్లికి రోజువారీ నాన్‌స్టాప్‌ విమానాల్ని నడపనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com