పతంజలి ఫుడ్ పార్క్కు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి
- September 10, 2016
ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్బాబా ఆధ్వర్యంలో నాగపూర్లో నెలకొల్పుతున్న పతంజలి మెగా ఫుడ్ అండ్ హెర్బల్ పార్కుకు శనివారం శంకుస్థాపన చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమంలో రామ్దేవ్ బాబా మాట్లాడుతూ దాదాపు 230 ఎకరాల్లో నిర్మించనున్న ఈ పతంజలి ఫుడ్ పార్క్ ద్వారా 10వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు అవుతుందని వెల్లడించారు. రకరకాల వ్యవసాయ ఉత్పత్తుల కోసం పతంజలి గ్రూప్ వ్యవసాయదారులకు రుణసౌకర్యం కల్పిస్తుందన్నారు.
పతంజలి ఫుడ్ పార్క్ కోసం వేరే రాష్ట్రాలు ఉచితంగా స్థలాలను ఇస్తామన్నా, నాగ్పూర్లోనే దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఫడణవీస్ వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ పార్క్ ఇదేనన్నారు. ఇందుకోసం పతంజలి సంస్థ ఎకరాకి రూ.25లక్షలు చెల్లించి స్థలాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







