పొడవైన బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ నెట్వర్క్ను పూర్తి చేసిన చైనా
- September 10, 2016
ప్రపంచంలోనే అత్యంత పొడవైన బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ నెట్వర్క్ను చైనా పూర్తి చేసింది. చైనా హై-స్పీడ్ రైల్వే 20వేల కిలోమీటర్ల పొడవైన ట్రాక్ నెట్వర్క్ను ఏర్పాటు చేసి ఈ ఘనత సాధించింది. అత్యంత వేగవంతమైన రైళ్లలో భారత్ సహా ప్రపంచ దేశాలకు పోటీగా ఉండడానికి చైనా ఈ ట్రాక్స్ను ఏర్పాటు చేసింది. హెనాన్ ప్రావిన్స్లోని జెంగ్జోహు నుంచి జియాంగ్సు ప్రావిన్స్లోని జుజోహు వరకు ఏర్పాటు చేసిన ప్రపంచంలోని అత్యంత పొడవైన రైల్వే మార్గాన్ని చైనా ఈరోజు ప్రారంభించింది.
ఈ రైల్వే లైను నిర్మాణం 2012 డిసెంబరులో ప్రారంభం కాగా ఈ ఏడాది ఏప్రిల్లో ప్రయోగాత్మకంగా పరీక్షించడం ప్రారంభించారు.
ఈ లైను ద్వారా జియాన్ నుంచి షాంఘై నగరానికి ప్రయాణ కాలం 11 గంటల నుంచి ఆరు గంటలకు తగ్గుతుంది. భారత్లో బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ డీల్ సొంతం చేసుకోవడానికి చైనా జపాన్తో పోటీ పడుతోంది. ముంబయి-అహ్మదాబాద్ల మధ్య హైస్పీడ్ రైలు కాంట్రాక్ట్ జపాన్కు దక్కింది. చెన్నై-దిల్లీ మధ్య బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చైనా అధ్యయనం చేస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







