ఢిల్లీలో స్వల్ప భూకంపం
- September 10, 2016
ఉత్తర భారతదేశంలో మరోసారి భూకంపం సంభవించింది. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో దేశరాజధాని ఢిల్లీ, గురుగ్రామ్, హర్యానా సహా పలు ప్రాంతాల్లో భూమి పలుమార్లు కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదయినట్లు భారత్ వాతావరణ శాఖ( ఐఎండీ) తెలిపింది.
హర్యానాలోని జగ్గర్ కేంద్రంగా భూగర్భం లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు చెప్పింది. దాదాపు 30 సెకండ్ల పాటు ఢిల్లీలో భూమి కంపించినట్లు రాజధానివాసులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఢిల్లీ, ఎన్సీఆర్ రీజియన్లలో మూడు వారాల క్రితం 3.7 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నేపాల్ లో గత ఏడాది సంభవించిన భారీ భూకంపం తర్వాత నుంచి ఉత్తరాదిలో పలుమార్లు భూమి కంపిస్తూ వస్తోంది.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక నిధి సమీకరణ కార్యక్రమం
- రైల్వే శాఖ కీలక నిర్ణయం...
- శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు
- వయనాడులో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- వైఎస్ జగన్కు అస్వస్థత.. పులివెందుల కార్యక్రమాల రద్దు
- ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం, ఫ్లూ షాట్ డ్రైవ్
- ఏపీ ప్రభుత్వం మరో బిగ్ డెసీషన్..
- విబిజీ రామ్జీతో గ్రామాల్లో నవశకం: ఎంపీ డి.కె అరుణ
- రాచకొండ సుధీర్ బాబుకు అదనపు డిజిగా పదోన్నతి







