పవన్ కళ్యాణ్ పై తెలంగాణా అడ్వొకేట్ల జెఎసి మండిపడింది..
- September 11, 2016
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణా అడ్వొకేట్ల జెఎసి మండిపడింది. కాకినాడలో పవన్ చేసిన ప్రసంగం తమ సెంటిమెంట్లను గాయపరిచిందని ఆరోపిస్తూ కొందరు లాయర్లు హైదరాబాద్ నాంపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి తన గెడ్డం గీసుకున్నంత తేలికగా కేంద్రం 2014 లో తెలంగాణాను వేరు చేసిందని పవన్ వ్యాఖ్యానించాడని, ఇది రెచ్చగొట్టే స్టేట్ మెంట్ అని వారు విమర్శించారు.
రాష్ట్ర విభజన జరిగాక మనో వేదనతో తాను 11 రోజులు ఆహారం తీసుకోలేదని పవన్ చేసిన వ్యాఖ్యలను కూడా వారు గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య కలతలు రేపి వివాదాలు సృష్టించేవిగా ఉన్నాయని అన్నారు. కాగా పోలీసులు ఈ ఫిర్యాదును తీసుకున్నప్పటికీ ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







