పవన్ కళ్యాణ్ పై తెలంగాణా అడ్వొకేట్ల జెఎసి మండిపడింది..
- September 11, 2016
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై తెలంగాణా అడ్వొకేట్ల జెఎసి మండిపడింది. కాకినాడలో పవన్ చేసిన ప్రసంగం తమ సెంటిమెంట్లను గాయపరిచిందని ఆరోపిస్తూ కొందరు లాయర్లు హైదరాబాద్ నాంపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఒక వ్యక్తి తన గెడ్డం గీసుకున్నంత తేలికగా కేంద్రం 2014 లో తెలంగాణాను వేరు చేసిందని పవన్ వ్యాఖ్యానించాడని, ఇది రెచ్చగొట్టే స్టేట్ మెంట్ అని వారు విమర్శించారు.
రాష్ట్ర విభజన జరిగాక మనో వేదనతో తాను 11 రోజులు ఆహారం తీసుకోలేదని పవన్ చేసిన వ్యాఖ్యలను కూడా వారు గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య కలతలు రేపి వివాదాలు సృష్టించేవిగా ఉన్నాయని అన్నారు. కాగా పోలీసులు ఈ ఫిర్యాదును తీసుకున్నప్పటికీ ఎలాంటి కేసు నమోదు చేయలేదు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







