మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ
- December 25, 2025
కువైట్: మౌలానా అబుల్ కలాం అజాద్ 2025 జాతీయ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్ కి ఎన్.ఆర్.ఐ టీడీపీ కువైట్ ఆధ్వర్యంలో ఘనమైన అభినందన సభ నిర్వహించారు.ఈ కార్యక్రమం ఎన్.ఆర్.ఐ టీడీపీ కువైట్ గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి అధ్యక్షతన జరిగింది.
ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా స్వీకరించిన సందర్భంగా, నాజర్ సేవలను స్మరిస్తూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా వెంకట్ కోడూరి మాట్లాడుతూ, సయ్యద్ నాజర్ ఒక ఉత్తమ కవిగా సమాజ ఐక్యత, సామాజిక చైతన్యం కోసం తన కవిత్వం ద్వారా గొప్ప సందేశాలను అందిస్తున్నారని ప్రశంసించారు. జ్ఞానం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజంలో వ్యాప్తి చేయడంలో కవుల పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ అభినందన సభలో జనసేన పార్టీ కువైట్ ప్రతినిధి హరి రాయల్, టీడీపీ నాయకులు రాచూరి మోహన్, ముస్తాక్ ఖాన్, ఏం.డి.అర్షద్, రెడ్డయ్య చౌదరి, రవి, రామకృష్ణ, కరీం, బాబ్జీ, శ్యామ్, అలాగే జనసేన నాయకులు మల్లిఖార్జున, గంగా తదితరులు పాల్గొని నాజర్ ని అభినందించారు.
ఈ కార్యక్రమం కువైట్లోని తెలుగు ప్రవాసుల మధ్య సాంస్కృతిక, సామాజిక ఐక్యతను మరింత బలోపేతం చేసిన సందర్భంగా నిలిచింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







