అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- December 25, 2025
హైదరాబాద్: భారత క్రీడా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే అర్జున అవార్డుల నామినేషన్లలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు చోటు దక్కించుకోవడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది. డెఫ్ షూటర్ ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గాయత్రి ఈసారి అర్జున అవార్డుల కోసం నామినేట్ అయ్యారు.
దేశవ్యాప్తంగా ఎంపికైన 24 మంది క్రీడాకారుల జాబితాలో తెలంగాణ నుంచి వీరిద్దరి పేర్లు చోటు దక్కడం విశేషంగా నిలిచింది. వినికిడి లోపం ఉన్నా డెఫ్ ఒలింపిక్స్లో రెండు స్వర్ణాలు సాధించిన ధనుష్, నిలకడగా రాణిస్తున్న గాయత్రి ప్రతిభను సెలెక్షన్ కమిటీ గుర్తించింది. ఈ జాబితాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పరిశీలించి, రాష్ట్రపతి ఆమోదం తర్వాత అవార్డులు ప్రదానం చేస్తారు.
తాజా వార్తలు
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!
- విజిట్ వీసాలు హజ్కు అనుమతించవు: సౌదీ అరేబియా
- ఒమన్లో ఫ్యాటీ లివర్ కేసులు పెరగడం పై ఆందోళన..!!
- దుబాయ్ ప్రాపర్టీ వీసాకు కనీస పెట్టుబడి లేదు..ఖర్చు, ఎలా దరఖాస్తు చేయాలంటే?
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..









