సిరియాలో వైమానిక దాడులు, 100 పైగా మృతి
- September 11, 2016
సిరియాలో బాంబుల వర్షం కురిసింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే జరిగిన ఈ దారుణ సంఘటనల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈద్ అల్ అధా సందర్భంగా సోమవారం నుంచి 10 రోజుల పాటు కాల్పులు జరపరాదని అమెరికా, రష్యా శనివారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ఈ ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే తిరుగుబాటుదారుల ప్రాబల్యంలో ఉన్న ఇడ్లిబ్, అలెప్పో నగరాలపై వైమానిక దాడులు జరిగాయని ఉద్యమకారులు చెప్తున్నారు. ఈ దాడుల్లో ఇడ్లిబ్లో దాదాపు 60 మంది, అలెప్పోలో సుమారు 45 మంది మరణించారని తెలిపారు. ఐసిస్, అల్ ఖైదాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు అమెరికా, రష్యా సైనిక భాగస్వామ్యం కోసం ఒప్పందం కుదుర్చుకున్నాయి. సిరియాలోని జీహాదీ ఉగ్రవాదులపై సమన్వయంతో వైమానిక దాడులు చేయడానికి నిర్ణయించుకున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ దళాలపై కొత్త పరిమితులు విధించాయి. అమెరికా హోం శాఖ కార్యదర్శి జాన్ కెర్రీ మాట్లాడుతూ అమెరికా, రష్యా ఓ ప్రణాళికను ప్రకటిస్తున్నాయన్నారు. సిరియాలో హింసను తగ్గించేందుకు, శాంతి, రాజకీయ మార్పుకోసం ఈ ప్రణాళిక దోహదపడుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!







